పెద్దపల్లి : బ్లాక్ ఫంగస్తో ఓ హెల్త్ సూపర్ వైజర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని పెద్దపల్లి మండలం రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగన్నాథం అనే వ్యక్తి హెల్త్ సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. కాగా, అతడు కరోనాను జయించి బ్లాక్ ఫంగస్ బారిన పడ్డాడు. దీంతో అతడికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్కు తరలిస్తుండగా సిద్దిపేట దాటుతున్న క్రమంలో మృతి చెందాడు.