గోవిందరావుపేట, జూలై 7 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతం గా ఉన్నాయని ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే అన్నా రు. బుధవారం మండలంలోని గోవిందరావుపేట, పస్రా, గాంధీనగర్ గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను అదనపు కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా మండలకేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొ క్కల పెంపకంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వనంలో నాటిన మొక్కల మధ్యలో దూరం ఉన్నందున ఆ ప్రాంతంలో మరిన్ని మొక్కలు నాటాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్కు సూచించారు. అనంతరం గాంధీనగర్ ప్రకృతి వనాన్ని సందర్శించి సర్పంచ్ను అభినందించారు. ప్రకృతి వనం అభివృద్ధికి లక్ష రూపాయలుఅదనంగా కేటాయించాలని ఎంపీడీవోకు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు.
శ్రమదానంలో గొత్తికోయలు
సోమలగడ్డ అటవీ సమీపంలో నివసిస్తున్న గొత్తికోయ యువకులు జడ్పీటీసీ తుమ్మల హరిబాబు ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొని పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు సైడ్ డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. ఈ విషయాన్ని జడ్పీటీసీ గోవిందరావుపేటకు వచ్చిన అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన యువకులను అభినందించారు. గొత్తికోయలకు రేషన్కార్డుల జారీతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని హరిబాబు ఆదర్శ్సురభిని కోరారు. ఈ కార్యక్రమాల్లో కో ఆప్షన్ సభ్యుడు బాబర్, పంచాయతీ కార్యదర్శి సుమలత తో పాటు గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.