ఉట్నూర్ రూరల్/, జూలై 3: పర్యావరణ పరిరక్షణకు వనాలు దోహద పడుతాయని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని లింగోజితండా, శ్యాం పూర్, ఏందా, పులిమడుగు, తాండ్ర గ్రామాల్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, సర్పంచ్లు హరి, మల్లిక, సరితాశ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీడీవో తిరుమల, ఎంపీవో మహేశ్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఈజీఎస్ ఏపీవో రజినీకాంత్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అజీమొద్దీన్, పీఆర్ ఏఈ రమేశ్, ట్రాన్స్ కో ఏఈ రాజేశం, మాజీ జడ్పీటీసి జగ్జీవన్, నాయకుల అన్సారీ, కాటం రమేశ్, సిద్ద రాజేశ్వర్, సెడ్మకి సీతారాం, కుటికెల ఆశన్న, బెరిగెడి మనోహర్, కందుకూరి రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని హస్నాపూర్లో పూడిక తీత పనులను డీఎల్పీవో భిక్షపతిగౌడ్ పరిశీలిం చారు. ఎంపీవో మహేశ్, సర్పంచ్ ఉపేందర్, ఉప సర్పంచ్ అశోక్, కో-ఆప్షన్ సభ్యుడు జావీద్, కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఉట్నూర్, జూలై 3: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో రవీందర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు కేశవ్, శ్రీనివాస్రావు, మంజుల, సువర్ణ, శ్రీలత, సుజాత, దినేశ్ రెడ్డి, సాంబరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్, జూలై 3: నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి మండలలో ముమ్మరంగా నిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్, మొక్కలు నాటడంతో పాటు పలు పనులు చేపట్టారు. కార్యక్రమం లో ఎంపీడీవోలు రమేశ్, రామేశ్వర్, ఎంపీవో స్వప్నశీల, సాయిప్రసాద్, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, సర్పంచ్లు, కార్యదర్శులు ఉన్నారు.
ఇంద్రవెల్లి, జూలై 3: మండలంలోని ఇంద్రవెల్లి, వాల్గొండ పంచాయతీల్లో సర్పంచ్లు కోరెంగా గాంధారి, కినక జుగాదిరావ్ గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
తలమడుగు, జూలై 3 : హరితహారంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములై ఇంటింటా ఆరు మొక్కలు నాటా లని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండ లంలోని సుంకిడి, ఖోడద్, ఉండం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను, నర్సరీలు, శ్మశాన వాటికలను డీఆర్డీవో కిషన్తో కలిసి శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో దిలీప్, సర్పంచ్లు మహేందర్ యాదవ్, ఆనంద్, కంది నర్సింహులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూలై 3 : కుంటాల (కే), వెంకటా పూర్, వాగ్దారి పంచాయతీల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటిక పనులను అడిషనల్ కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో కిషన్ పరిశీలించారు. నర్సరీల నిర్వ హణ తీరుపై పంచాయతీ కార్యదర్శులపై మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఏపీవో వసంత్రావ్, కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు. రాజురాలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ మొక్కలు నాటారు. కార్యక్ర మంలో సర్పంచ్ జాదవ్ అనూష, కార్యదర్శి నవీన్, నాయకులు జాదవ్ వసంత్రావు, గ్రామ పెద్దలు కాశీరాం, మంగ్యా, సుధాకర్, అనిల్ పాల్గొన్నారు. బంధంరేగడిలో సర్పంచ్ మంజూష,కిష్టాపూర్లో సర్పం చ్ సోలంకి గీత మొక్కలు పంపిణీ చేశారు. వడూర్లో మండల ప్రత్యేకాధి కారి, మైనింగ్ ఏడీ రవిశంకర్ ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. బుద్దికొండలో పల్లె ప్రగతి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, సర్పంచ్లు గాదె సమత, గంగామణి, కార్యదర్శులు మల్లారెడ్డి, రాజారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాంసి, జూలై 3: తాంసి, పొన్నారి, హస్నాపూర్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో ఆకుల భూమయ్య, సూపరింటెండెంట్ రవీందర్, ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచ్లు సంజీవ్రెడ్డి, నర్సింగ్, కృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు.
బేల, జూలై 3 : మండల కేంద్రంలో పల్లె ప్రగతి పను లను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలిం చారు. మొక్కలు నాటారు. అనంతరం మార్కె ట్ కూడలిలో తిరుగుతూ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటిం చాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఎంపీడీవో భగత్ రవీందర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, కార్యదర్శి సురేశ్, ఆయా శాఖల ఆధికారులు, పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూలై 3 : మండలంలోని ముక్రా (కే)లో రెండు వేల మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షీ, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్షతాయి, కార్యదర్శి కిరణ్, పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాబా (కే) గిరిజన గ్రామంలో కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలను మహిళలకు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో రోడ్లు ఊడ్చి, మురుగు కాలువలను శుభ్రం చేశారు.
బోథ్, జూలై 3 : బోథ్ పరిధిలోని కొత్త కాలనీలో సర్పంచ్ జీ సురేందర్ యాదవ్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం పిప్పల్ధరి రోడ్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కే పల్లవి, ఎంపీవో జీవన్రెడ్డి, ఈవో సంజీవ్రావు, టీఏ శంకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కుచ్లాపూర్లోని ఏకోపాధ్యాయ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటా రు. సర్పంచ్ కే చంద్రమోహన్, భూతి రజిత, రమాదేవి, పీ రజిత, కళావతి, స్వప్న పాల్గొన్నారు. హరిత హారానికి చేయూత అందించాలనే సంకల్పంతో మండ లంలోని కుచ్చిరాల తండాకు చెందిన భజరంగ్ యూత్ సభ్యులు వంద మొక్కలు నాటేందుకు శ్రమదానం చేసి గుంతలు తవ్వారు. వంద మొక్కలు నాటి పరిరక్షిస్తామ న్నారు. కార్య క్రమంలో అధ్యక్షుడు సీహెచ్ జీవన్, ఉపాధ్యక్షుడు రాము, శ్రీరాం, రోహిదాస్,రాజేశ్, మహే శ్ పాల్గొన్నారు. ధన్నూర్ (కే)కు చెందిన ఓ బాలుడు మొక్కలు నాటాలని సంకల్పించాడు. తన ఇంటి పెర టిలో స్వయంగా గుంతలు తవ్వి మొక్కలు నాటాడు.
జైనథ్, జూలై 3: దీపాయిగూడ, ఆనందర్పూర్, కాప్రిలో జడ్పీ సీఈవో గణపతి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో గజానన్రావు, ఏపీవో జగ్గేరావు, సర్పంచ్లు బొల్లు గంగన్న, రాధిక, సాయినాథ్, అడ్డి లత వెంకట్రెడ్డి, రతన్రెడ్డి, కార్యద ర్శులు పాల్గొన్నారు. భోరజ్లో పాడైపోయిన స్తంభాల ను ట్రాన్స్కో డీఈ(ఆపరేషన్) రమేశ్ పరిశీలించారు. ఎంపీటీసీ మహేం దర్రెడ్డి, ఏఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జూలై 3 : పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకధికారి శ్రీనివాస్రెడ్డి, మండల అధికా రులు పర్యవేక్షించారు. అనంతపూర్లో ఇంటింటికీ మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం శంకర్, పీఆర్ ఏఈ నారాయణ, ఏపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సిరికొండ, జూలై 3 : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్క లు నాటారు. కొండాపూర్లో ఎంపీడీవో సురేశ్ మొక్క లు నాటారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 3: మావలలో ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీటీసీ నల్లా వనిత ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు పంచాయతీ సిబ్బంది కృషి చేయాలన్నారు.
ప్రజలు తరలిరావాలి..
ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా దుర్గానగర్, మావల అటవీ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జడ్పీటీసీ నల్లా వనిత కోరారు. మావలలో మొక్కలు నాటే ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీళ, ఎంపీడీవో అరుణ, వైస్ ఎంపీపీ గోవర్ధన్, ఉప సర్పంచ్ మహేందర్ యాదవ్, నాయకులు నల్లా రాజేశ్వర్, దొగ్గలి రాజేశ్వర్, దశరథ్ పాల్గొన్నారు.