సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ M-సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ రియల్మీ8, పొకో ఎం3 ప్రొ, రెడ్మీ నోట్ 10 వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది. ఎం-సిరీస్లో ఇప్పటికే గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎం 31ఎస్, గెలాక్సీ ఎం 51 మోడళ్లను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 6,000 mAh బ్యాటరీతో వస్తుండగా 25 W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .14,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ కలర్లలో విడుదలైంది.
జూన్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్.ఇన్, శాంసంగ్.కామ్, రిటైల్ స్టోర్ల నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ కార్డులతో కొనుగోలు చేస్తే వినియోగదారులు 1,250 ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్ పొందొచ్చు.