యువ పురస్కార్ అవార్డుల ప్రదానం

రాయికల్ రూరల్, 16 : స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ రంగాలల్లో విశేష సేవలందించిన యువజన సంఘాలకు రాష్ట్ర స్థాయి యువ పురస్కార్ అవార్డులు వచ్చాయి. భూపతిపూర్ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మైతాపూర్ నాగిరెడ్డి రఘపతిరెడ్డి, ఆలూరు మెక్కొండ రాంరెడ్డి, లింగాపూర్ గంగాధర్, రాయికల్ బూర్గుల రాజేందర్, కట్కాపూర్ మాదం మల్లేశ్ కోరుట్లలోఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
మేడిపల్లి, జనవరి 16 : వెంకట్రావుపేట మాజీ సర్పంచ్, జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అంగడి ఆనంద్కుమార్, కొండాపూర్ సర్పంచ్ ద్యావనపెల్లి అభిలాష్, తొంబర్రావుపేటకు చెందిన నల్ల మహిపాల్రెడ్డికి రాష్ట్ర యువ పురస్కార్ 2021 అవార్డులను ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ప్రదానం చేశారు. శనివారం జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు అవార్డు గ్రహీతలను శాలువాలతో సన్మానించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వంగ వెంకటేశం, దుంపేట లక్ష్మీనర్సయ్య, గాజోజి చారి, ఎంపీటీసీలు చెన్నమనేని రవీందర్రావు, మకిలి దాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్, నాయకులు సుధవేని గంగాధర్, నెల్లుట్ల ప్రభాకర్, కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, నాంచారి రాజేందర్, బాలుసాని మారుతి, చెక్కపెల్లి రఘు, లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు.
కొడిమ్యాల: నల్లగొండకు చెందిన అంతర్జాతీయ ఒగ్గు కథా కళాకారుడు బొల్లి రాజుయాదవ్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత చేతుల మీదుగా యువ పురస్కార్ అవార్డును శనివారం అందుకున్నారు. కోరుట్లలో యువజన సంఘాల సమితి వారు కళారంగలో ప్రతిభ కనబర్చిన రాజుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
తాజావార్తలు
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా