ఎల్బీనగర్, జూన్ 15: ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మందికి అండగా నిలుస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో బాధిత కుటుంబానికి రూ.4లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని హరిజన బస్తీకి చెందిన మణెమ్మ గుండె సమస్యలతో ఓ ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేయించుకున్నది. ఆర్థిక సాయం కోసం సీఎంఆర్ఎఫ్నకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4 లక్షల చెక్కును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అందజేశారు. నిరుపేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, టీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్గౌడ్, కట్ట వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.