ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నల్లగొండ రూరల్, జూన్ 5 : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికీ 15కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పట్టణలోని 48వ వార్డులో రేషన్షాపు-45 వద్ద బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో మూడు నెలలపాటు ఉచిత బియ్యంతోపాటు నెలకు రూ.1500 అందజేసినట్లు గుర్తుచేశారు. కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఎం నరేశ్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తాసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి, కౌన్సిలర్ కవిత, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ పాల్గొన్నారు.