ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నిత్యావసర సరుకుల పంపిణీ
బెల్లంపల్లిరూరల్, జూన్ 3: కరోనా కష్టకాలంలో గ్రామాల్లో వైద్య సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని ఆశ కార్యకర్తలకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించడంలో ఆశ కార్యకర్తలు సేవాభావంతో విధులు నిర్వర్తించారన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, తాళ్లగురిజాల సర్పంచ్ గాజుల రంజిత, పీహెచ్సీ వైద్యాధికారి ఝాన్సీ, హెచ్ఈవో సమ్మయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కాసిపేట, జూన్ 3 : కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 44 మంది ఆశ కార్యకర్తలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్వర సర్వేలో సైతం ఆశ కార్యకర్తల పాత్ర కీలకమైందన్నారు. వారికి కృతజ్ఞతగా సాయం అందిస్తున్నానని తెలిపారు. ఆశ కార్యకర్తల జీతాలు పెంచేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కొవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, నాయకుడు రమణారెడ్డి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, చంద్రమౌళి, ఎంపీడీవో ఎంఏ అలీం, ఉప సర్పంచ్లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాసుదేవ్, మంజులారెడ్డి, పెద్దనపల్లి గ్రామ అధ్యక్షుడు చింతల భీమయ్య, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ఖాన్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ అలుగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.