న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.95 పెరిగి రూ.48,920కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం పసిడి ధర రూ.47,920 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.154 పెరిగి రూ.70,998 కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,844 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,882 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.67 అమెరికన్ డాలర్లు పలికింది.