వరంగల్లోని గోవిందరాజులగుట్ట ఆయన స్వస్థలం
ఉత్తర్వులు రాగానే బాధ్యతల స్వీకరణ
భీమారం, మే 22 : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా కేయూ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ నియమితులయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో యూనివర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లతో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపించిన ఫైల్పై శుక్రవారం రాత్రి గరవర్నర్ సంతకం చేశారు. రెగ్యులర్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ సాయన్న పదవీకాలం 2019 జూలైలో ముగిసింది. ఆయన స్థానం లో ఇన్చార్జి వీసీగా డాక్టర్ జనార్దన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభు త్వం ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించింది. ఈ నేపథ్యంలో కొత్త వీసీగా రమేశ్ నియామకమయ్యారు.
ప్రొఫెసర్ రమేశ్ ఓరుగల్లు వాస్తవ్యుడే. స్వస్థలం నగరం లోని గోవిందరాజులగుట్ట. 1962 డిసెంబర్10న జన్మిం చారు. ప్రాథమిక విద్యాభ్యాసం, హైస్కూల్, ఇంటర్, డిగ్రీ వరంగల్ నగరంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూరివర్సిటీలో 1987లో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్, 2009 సంవత్సరంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1992లో కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమయ్యారు. కేయూ పరిధిలోని నిర్మల్ పీజీ సెంటర్లో సోషియాలజీ విభాగంలో చేరిన రమేశ్, కేయూ సోషియాలజీ విభాగాధిపతిగా, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా, బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్గా, సోషల్ సైన్స్ డీన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేయూ అకడమిక్ ఆడిట్ డీన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ సామాజిక అంశాలపై 20కి పైగా పుస్తకాలు రాసిన ఆయన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. రమేశ్ పర్యవేక్షణలో 8మంది పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కేయూ ఇన్చార్జి వీసీ జనార్దన్రెడ్డి నుంచి వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.