న్యూఢిల్లీ: వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్వర్క్లలో బయటి వ్యక్తులు ఈ- పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ-పేపర్లను సోషల్ మీడియా వేదికల్లో ఉంచడం వారి కాపీ రైట్ను ఉల్లంఘించడమేనని జస్టిస్ జయంత్ నాథ్ స్పష్టం చేశారు. ఈ కేసులో వాట్సాప్, టెలీగ్రామ్తో పాటు ఆయా మీడియా గ్రూపుల అడ్మినిస్ట్రేటర్లుగా ఉన్న పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్ ఈ- పేపర్లను సోషల్ మీడియా నెట్వర్క్లలో పోస్టు చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయా పత్రికల తరఫున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నుంచి ఈ సమస్య ఎక్కువైందని, తమ పత్రికలను డౌన్లోడ్ చేసుకుని అనుమతి లేకుండా వాట్సాప్, టెలీగ్రామ్ వంటి నెట్వర్క్లలో పోస్టు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యంపై స్పందించాలని, తమ ఉత్తర్వులను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 18 వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై స్పందించాలని ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
ఆఫ్ఘాన్లో జిల్లాను ఆక్రమించిన తాలిబాన్లు.. దాడుల్లో 40 మంది తాలిబాన్లు హతం
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..