లాక్డౌన్పై నిఘా
అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం
ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
అనవసరంగా బయటకు వస్తే జరిమానాలు, కేసులు
నెట్వర్క్, మే 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నది.. మినహాయింపు వేళలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వస్తున్నారు.. దీంతో రహదారులు, నిత్యావసర దుకాణాలు కిక్కిరిసి పోతున్నాయి.. మినహాయింపు వేళలోనూ బయటకు వస్తున్న ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.. కొన్ని చోట్ల జరిమానాలు విధిస్తున్నారు.. అయినా ప్రజలు పట్టించుకోకుండా బయటకు వస్తున్నారు.. లాక్డౌన్ తీరును ఆయా జిల్లాల ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.. సరిహద్దుల వద్ద ఈ-పాస్ లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.