12వ డివిజన్లో భరోసా యాత్ర
ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, మే 18: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్ టాస్క్ఫోర్సు ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రామగుండం 12వ డివిజన్లో కరోనా బాధితుల కోసం ‘మీ కోసం మీ ఎమ్మెల్యే భరోసాయాత్ర’ ఎమ్మెల్యే చందర్ మంగళవారం చేపట్టారు. కరోనా సోకిన వారికి నివాసాల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కరోనాపై భయపడవద్దని ధైర్యం నింపారు. బాధితులకు నిత్యావసరాలు, పౌష్టికాహారం, పండ్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా బాధితులను ఆదుకునేందుకు వారిలో గుండెధైర్యం నింపేందుకు మీ కో సం మీ ఎమ్మెల్యే యాత్ర చేపడుతున్నానని వివరించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన వెంట మేయర్ అనిల్కుమార్, నాయకులు బొడ్డు రవీందర్, రాకం వేణు, వైద్య సిబ్బంది ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
అనంతరం ఇదే డివిజన్కు చెందిన ఆరుగురికి రూ.2.27లక్షల సీఎంఆర్ఎఫ్ పథకం కింద చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే చందర్ లబ్ధిదారులకు అందజేసి భరోసా కల్పించారు. ఎంతోమంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని వివరించారు.