కోల్ కతా : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న క్రమంలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
లాక్డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కరోనా బారినపడి ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్కతాలోని మెడికా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.