భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. కరోనా వైరస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న రోగిపై మగ నర్సు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఆ బాధిత మహిళ తుది శ్వాస విడవడం విషాదకరం.
భోపాల్ నగరానికి చెందిన 43 ఏండ్ల మహిళ గత నెల 6 వ తేదీన కరోనా వైరస్కు గురై భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చికిత్స పొందుతున్నది. కాగా, చికిత్స కేంద్రంలో ఎవరూ లేనిది గమనించిన మగ నర్స్ సంతోష్ అహిర్వార్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు మహిళ దవాఖాన సిబ్బందికి, వైద్యులకు ఉదయాన్నే వెల్లడించింది. అదే సమయంలో ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ ఉన్న ఐసీయూకు తరలించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోగా.. సాయంత్రం తుదిశ్వాస విడిచింది. మహిళపై లైంగికదాడి జరిగిన విషయాన్ని దవాఖాన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంతోష్ అహిర్వార్పై నిషాత్పురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరోనా రోగిపై లైంగికదాడికి పాల్పడిన మగ నర్సు సంతోష్ అహిర్వార్ ఇటీవల మద్యం సేవించి విధులకు హాజరవడంతో అధికారులు ఆయన్ను విధుల నుంచి తప్పంచారు.
ఈ బాధిత మహిళ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడి కోలుకున్నట్లు అధికారులు చెప్పారు. మహిళపై లైంగిక దాడి అనంతరం భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లోని కోవిడ్ వార్డుల దయనీయమైన పరిస్థితిపై విపత్తు బాధితుల సంఘం అధికారులకు బలమైన లేఖ రాసింది.
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై క్రైమ్ బ్రాంచ్ కన్ను
జైలులో ఖైదీల మధ్య కాల్పులు, ఇద్దరు హతం
గూగుల్తో జతకట్టిన ఎలోన్ మస్క్ ‘స్టార్లింక్’
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..