ఆర్టీఏ సేవలన్నీ లాక్డౌన్ ముగిసిన తర్వాతే అందిస్తామని సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) పాండురంగనాయక్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు లాక్డౌన్ ముగిశాక క్రమపద్ధతిన కార్యాలయాలకు రావాలని సూచించారు. ఇప్పటికే స్లాట్స్ బుక్ చేసుకున్న వారికి మెస్సేజ్లు పంపించామని, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ సేవలన్నీ లాక్డౌన్ అనంతరమే ఉంటాయని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ వల్ల వాహనదారులు కార్యాలయాలకు రాలేని పరిస్థితితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.