హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కొవి డ్ చికిత్సలో వినియోగించే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను తయారు చేయనున్నట్టు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ వివిమెడ్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఐ) నుంచి అనుమతులు లభించినట్టు సోమవారం వెల్లడించింది. ‘ఫావులోస్’ పేరుతో 200 ఎంజీ, 400 ఎంజీ ట్యాబ్లెట్లను తయారుచేసి దేశీయ మార్కెట్లోకి విడుదలచేస్తామని వివిమెడ్ ల్యాబ్స్ కంపెనీ సీఈవో రమేశ్ కృష్ణమూర్తి చెప్పారు. తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. అటు.. ప్రముఖ ఫార్మా దిగ్గజ సంస్థ సిప్లా కరోనా చికిత్సలో వినియోగించే ‘బారిసిటినిబ్’ను ఉత్పత్తి చేయనున్నది. ఈ మేరకు అమెరికాకు చెం దిన లిల్లి ఎల్లీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. కొవిడ్ రోగులకు బారిసిటినిబ్ను వినియోగించేందుకు సీడీఎస్సీవో అనుమతి ఇచ్చింది.