అబిడ్స్, మే 9 : కుటుంబ సభ్యులను గత కొంత కాలంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్స్టేషన్ పరిధిలోని గత కొంత కాలంగా రవీందర్, మహేందర్, ప్రసాద్ (21)లు తల్లితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్ తరచుగా అన్నలు, తల్లితో డబ్బు విషయంలో గొడవ పడుతుండటంతో రవీందర్ జీడిమెట్లకు మారాడు. మహేందర్, భార్య, తల్లి కూడా ఇల్లు మారాడు. అయినప్పటికీ ఇంట్లో ఒక్కడే ఉంటున్న ప్రసాద్ వారి ఇంటి వద్దకు వెళ్లి మహేందర్, తల్లితో గొడవ పడుతుండటంతో మహేందర్ జీడిమెట్లలో ఉన్న రవీందర్కు ఫోన్ చేసి మాట్లాడటానికి రావాల్సిందిగా కోరాడు. దీంతో ఆదివారం రాత్రి రవీందర్, మహేందర్లు కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్లగా మద్యం సేవించి ఉన్న ప్రసాద్ వారితో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రవీందర్, మహేందర్లు ప్రసాద్ను చున్నీతో హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.