డెహ్రాడూన్, మే 9: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్సింగ్ చాంపియన్ కుమారుడు దివ్యప్రతాప్ సింగ్ కరోనా టీకా తీసుకోవడం వివాదాస్పదమైంది. దివ్యప్రతాప్ వయస్సు 25 ఏండ్లు. ఉత్తరాఖండ్లో 18-44ఏండ్ల వయస్సు ఉన్నవారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. ‘ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు ముగ్గురూ మే 5న డూన్ దవాఖాన సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి టీకా వేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు’ అని దవాఖాన సిబ్బంది తెలిపారు.