మహబూబాబాద్ : శుక్రవారం మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.5,44,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, గోగుల రాజు, అశోక్, బాలు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.