వాషింగ్టన్ : అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) టీకా సలహా కమిటీ శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిఫారసు చేసింది. వ్యాక్సిన్ ప్రయోజనాలు నష్టాలను అధిగమిస్తాయని పేర్కొంది. ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్పై సీడీసీ సలహా కమిటీ టీకా పునర్వినియోగానికి 10-4 ఓట్లు వేసింది. జేఅండ్జే వ్యాక్సిన్ వాడకానికి సంబంధించి చర్చించడానికి సీడీసీ ప్యానెల్ ఈ వారంలో శుక్రవారం రెండోసారి సమావేశమైంది. మహిళలు తమకు సౌకర్యవంతంగా ఉంటే, ప్రమాదాల గురించి తెలిస్తేనే టీకా తీసుకోవాలని సూచించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ఎంపిక చేసుకోవచ్చని ప్యానెల్ చెప్పింది.
వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో అరుదుగా రక్తం గడ్డకట్టడంతో గతవారంలో టీకా పంపిణీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అమెరికాలో 15 రక్తం గడ్డకట్టిన కేసులు నమోదయ్యాయి. ఇందులో 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లోనే 13 కేసులున్నాయి. పురుషులతో సహా అన్ని సంభావ్య కేసులపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ అందుకున్న దాదాపు ఎనిమిది మిలియన్ల అమెరికన్లలో మూడు మరణాలు నమోదయ్యాయి. ఏడుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా.. నలుగురు ఐసీయూలో ఉన్నారు.
ఇవికూడా చదవండి..