పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 18: రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయించారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండ లం నిట్టూరు, నిమ్మనపల్లిలో పెద్దపల్లి సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని సూచించారు.
హమాలీలు బీమా చేయించుకోవాలి
కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్న హమాలీలందరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని, ఆ దిశగా అధికారులు సింగిల్ విండో చైర్మన్లు శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎం డలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీబండారి రామ్మూర్తి, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ మాదారపు ఆంజనేయరావు, సర్పంచ్ ఆరెపల్లి కవిత వెంకట్రాజం, ఎంపీటీసీ దొంత రాజయ్య, ఉప సర్పంచ్ గిర్నేని సంపత్రావు, నాయకులు ఆకుల శ్రీనివాస్, మాదారపు వేణగోపాల్రావు, డైరెక్టర్ మెట్టు సమ్మయ్య గౌడ్, సీఈవో మధుకర్ ఉన్నారు.
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. చీకురాయిలో ఎస్డీఎఫ్ నిధులు రూ.19.92 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మండారి త్రివేణి, ఎంపీటీసీ మేకల రాజేశ్వరి శ్రీనివాస్యాదవ్, పంచాయతీ కార్యదర్శి పీ రాధ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం మండలంలో..
ధర్మారం, ఏప్రిల్ 18: మల్లాపూర్లో పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట రెడ్డి, ఎర్రగుంటపల్లిలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో లంబాడి తండా (బీ), మల్లాపూర్ సర్పంచులు భూక్యా చంద్ర నాయక్, గంధం వరలక్ష్మి, ఎంపీటీసీలు భూక్యా సరిత, గాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఉప సర్పంచులు అనిల, మంద శ్రీనివాస్, ప్యాక్స్ వైస్ చైర్మన్లు సామంతుల రాజమల్లు, పసునూటి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, ఆర్బీఎస్ బాధ్యులు పాకాల రాజయ్య, పాక వెంకటేశం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆయా గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు అజ్మీరా తిరుపతి నాయక్, గుమ్మడి శ్రీనివాస్, ఆవుల మల్లేశం, నాయకులు నున్సావత్ భాస్కర్ నాయక్, కల్లెం హన్మంత రెడ్డి, గంధం నారాయణ, బద్దం రవీందర్ రెడ్డి, తాళ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.