కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరేస్తాం..
రూ. 3వేల కోట్లతో నగరాభివృద్ధి
అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ టీఆర్ఎస్సే
కాంగ్రెస్కు లీడర్లు లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు
విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, ఏప్రిల్15: గ్రేటర్ ఎన్నికల్లో బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగురేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో గురువారం సాయంత్రం హన్మకొండ రాంనగర్లోని నిత్య బాంక్వెట్ హాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బల్దియా ఎన్నికల్లో 66 సీట్లు కైవసం చేసుకుం టామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ఉన్నారన్నారు. రూ. 3 వేల కోట్లతో గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొ న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందున్న వరంగల్, ఏర్పాటైన అనంతరం నగర అభివృద్ధిపై ప్రజలు చర్చించు కుంటున్నారన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, జంక్షన్లు, ఆహ్లాదకర మైన వాతావరణాన్ని కల్పించేందుకు బండ్లు, ఉద్యాన వ నాలు, పార్కులు అభివృద్ధి చేశామని తెలిపారు. అదేవిధంగా సమైక్యాంధ్ర పాలనలో మరుగున పడ్డ చెరువులు, చారిత్రక కట్టలను వేలాది కోట్లతో పునరుద్ధరించామని అన్నారు.
అం దులో చేపలు పెంచడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు. ఇటీవల కేటీఆర్ వరంగల్ పర్యటన సంద ర్భంగా రూ. 2700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ప్రజలకు మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కూడా కేటాయించారన్నా రు. గత పాలకుల హయాంలో కార్పొరేషన్ పరిధిలో వేసవి వస్తే తాగునీటి సమస్య ఉండేదని, పబ్లిక్ నల్లాలు, ట్యాంకర్ల వద్ద ప్రజలు బారులు తీరి ఉండే వారన్నారు. ప్రస్తుతం నీటి కొరత లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛ మైన మంచినీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నా రు. వైకుంఠధామాలు కూడా నిర్మించామని తెలిపారు. ప్రజ ల అవసరాలను తీ ర్చేందుకు రూ.5కోట్లతో నగరంలో మూ డు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిం చనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఇక్కడ జరుగుతున్న అభి వృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను కలిగి ఉందని చీఫ్ విప్ పేర్కొ న్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేసు కుంటున్న వారికి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే వరంగ ల్ అభివృద్ధి సాధ్యమనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిల నేతృత్వంలో ఎన్నికల ప్రచారానికి వ్యూహరచన చేసినట్లు దాస్యం తెలిపా రు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉం టుందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు ఎవరూ పోటీ కాదని, కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని, ప్రజలు సైతం వారి పక్షాన లేరన్నారు. కార్య క్రమంలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇన్చార్జి గ్యాదరి బాల మల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, కుడా చైర్మ న్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, టీఆర్ఎస్ నాయకులు జనార్ద న్గౌడ్, చిర్ర రాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి