చందంపేట, ఏప్రిల్ 9 : ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం నల్లగొండ జిల్లా ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. స్థానికంగా నీటి వనరులుగానీ, కరెంట్ సౌకర్యంగానీ లేకపోవడంతో గుక్కెడు నీటికి సైతం తండ్లాడాల్సి వచ్చేది. ప్రధానంగా తండాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల దగ్గరకు పోవాల్సిన దుస్థితి. స్వరాష్ట్రంలో వారి కష్టాలు తీరాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇంటికే సరఫరా అవుతున్నది. దీంతో ఫ్లోరైడ్తోపాటు అనారోగ్య సమస్యలు దూరమయ్యాయి. చందంపేట మండలంలో 47 గ్రామ పంచాయతీలతోపాటు 106 ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 12 వరంగల్కు మంత్రి కేటీఆర్ రాక
లాలు బెయిల్ పిటిషన్ విచారణ వారం వాయిదా