టాలీవుడ్ యాక్టర్ రానా ఇప్పటికే బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్, విరాటపర్వం వంటి పీరియాడిక్ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. త్వరలోనే విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రానా తాజాగా మరో పీరియాడిక్ ప్రాజెక్టును ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రానా డైరెక్టర్ సుకుమార్ సన్నిహితుడు వెంకీతో ఓ సినిమాను చేస్తాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి.
వెంకీ ఇటీవలే రానాకు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం వెంకీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇటీవలే పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన అరణ్య మూవీతో తెలుగుతోపాటు వివిధ భాషా ప్రేక్షకులను పలుకరించాడు రానా. ఈ చిత్రంలో రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇవి కూడా చదవండి
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా