మంచిర్యాల : ప్రయాణంలో ఉన్న బైక్పై నుండి పడి రోజువారి కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కన్నెపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుడిని టేకులపల్లి గ్రామానికి చెందిన రోజువారి కూలీ శీలం తిరుపతిగా గుర్తించినట్లు తెలిపారు. మూలమలుపు వద్ద బైక్ నుండి పడటంతో తలకు బలమైన దెబ్బతగలడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడన్నారు. టేకులపల్లి గ్రామానికి వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.