జగిత్యాల : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రైతులను రాజులుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.
గురువారం గొల్లపల్లి మండలంలో రైతు వేదికతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు. ఉచిత 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతు బంధు పథకాలతో రైతుల బతుకుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదన్నారు.
రైతుల ఉత్పతులకు మద్దతు ధర, సాగువిధానం, పంట మార్పిడిపై రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు వేదికలు ఉపయోగపడతాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
రైతు బంధు అధ్యక్షుడు అందుబాటులో ఉంటారు. పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. పల్లెప్రగతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రసంశించిందని గుర్తు చేశారు.
అభివృద్ధిని విమర్శిస్తే ప్రజలే వారిని తరిమి కొడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జీ రవి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్