ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్ గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో ఉన్న వాహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారి సచిన్ వాజేను హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వంద కోట్లు వసూలు చేయమని అడిగినట్లు పరంబీర్ సింగ్ ఆరోపించారు
దీనిపై సీబీఐ దర్యాప్తుతోపాటు తన బదిలీని సవాల్ చేస్తూ పరంబీర్ సింగ్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఆయన పిటిషన్ను బుధవారం తిరస్కరించింది. ఆరోపణలు తీవ్రమైనవేనని పేర్కొన్న సుప్రీంకోర్టు దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో పరంబీర్ సింగ్ గురువారం అనిల్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు.