నిర్మల్ జిల్లాకు 278 యూనిట ్ల మంజూరు
రూ.1.39 కోట్ల నిధుల విడుదల
నిర్మల్ టౌన్, మార్చి 24 : నిర్మల్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను పొందేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం మొదటి విడుత కింద రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిధులను విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను గత జనవరి నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మొత్తం 42 విభాగాల్లో యూనిట్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 84 విభాగాలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే 50వేల లోపు ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు 278 యూనిట్లకుగాను 1.39కోట్ల రుణాలను మంజూరు చేసింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలుండగా.. బాసరకు 9, భైంసాకు 20, భైంసా అర్బన్కు 13, దస్తురాబాద్కు 11, దిలావర్పూర్కు 9, కడెం పెద్దూర్కు 18, ఖానాపూర్ అర్బన్కు 7, ఖానాపూర్కు 14, కుభీర్కు 19, కుంటాలకు 9, లక్ష్మణచాందకు 14, లోకేశ్వరానికి 21, మామడకు 11, ముథోల్కు 17, నర్సాపూర్ (జి) 11, నిర్మల్ రూరల్ 15, నిర్మల్ అర్బన్ 17, పెంబికి 2, సారంగాపూర్కు 20, సోన్కు 9, తానూర్కు 12 యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కొక్కరికీ రూ. 50వేల చొప్పున రుణాలను అందించనున్నారు.
లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు
నిర్మల్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూతను అందించేందుకు సబ్సిడీ రుణాల యూనిట్లను మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపికపై అధికారులు కసరత్తు చేపట్టారు. మొదటి విడుత కింద రూ. 1.39కోట్లు విడుదలయ్యాయి. రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాస్థాయిలో రుణాల మంజూరు కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ సభ్యులుగా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మాండ్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ హరికృష్ణ నేతృత్వంలో జిల్లా కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల్లో ఆర్థికంగా అత్యంత వెనుకబడ్డ వారిని ముందుగా ఎంపిక చేస్తున్నారు. మొదటగా 42 స్కీంలు ఆన్లైన్లో పొందుపర్చగా.. వాటిని 83కు ప్రభుత్వం పెంచింది. స్కీంల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో ఈ నెల 26న లబ్ధిదారులకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెండో విడుత కింద వచ్చే నెలలో మళ్లీ నిధులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.