కావలసిన పదార్థాలు : మైదా: అర కేజీ, రాగిపిండి: అర కేజీ, వనస్పతి: పావు కేజీ, చక్కెర: 50 గ్రా., ఉప్పు: తగినంత, ఓమ, జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున.
తయారీ విధానం : ముందుగా మైదాలో రాగిపిండి, వనస్పతి వేసి బాగా కలపాలి. అందులో చక్కెర, ఓమ, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు చల్లి మృదువుగా కలపాలి. గాలి చొరబడకుండా కవర్లో పెట్టి అరగంటపాటు పక్కన పెట్టాలి. మిశ్రమం బాగా నానిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి, ఒకే సైజులో గుండ్రని బిళ్లల్లా ఒత్తుకోవాలి. ఫోర్క్తో బిస్కెట్స్పై అక్కడక్కడా గుచ్చితే సమంగా బేక్ అవుతాయి. నూనె పూసిన పాత్రలో బిస్కెట్స్ అమర్చి, ఇరవై నిమిషాలపాటు 350 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద బేక్ చేస్తే రుచికరమైన రాగి బిస్కెట్స్ రెడీ! రుచికి రుచీ పోషకాలకు పోషకాలు.