న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాల ఉపసంహరణ వేగంగా సాగుతున్నది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కీలక రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ రైల్వేల పరిధిలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో 15 శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు సర్వం సిద్ధమైంది.
బుధవారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించనున్నట్లు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది. తద్వారా ప్రభుత్వం రూ.755 కోట్ల ఆదాయం సముపార్జించనున్నది.
మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో రూ.30.40లకు షేర్ అమ్ముడైంది. ఇందులో 9.54 శాతం డిస్కౌంట్పై విక్రయించనున్నది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. అంటే ఈ సంస్థ షేర్ రూ.27.50లకు విక్రయించనున్నారు.
కరోనా మహమ్మారి టైంలో బుక్ వాల్యూ కంటే తక్కువ ట్రేడయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్.. తిరిగి గత జనవరి 11వ తేదీన రూ.35.60లతో 52 వారాల గరిష్ఠ రికార్డుకు చేరుకున్నది. రూ.30లోపుకు పడిపోయిన షేర్ గత ఫిబ్రవరి 23వ తేదీన రూ.29.75 వద్ద స్థిరపడింది. తిరిగి రూ.30 పై చిలుకుకు చేరింది.
18.32 కోట్లకు పైగా ఆర్వీఎన్ఎల్ షేర్లలో ఓఎఫ్ఎస్ రూట్లో 10 శాతం షేర్లు విక్రయిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థలో 87.84 శాతం వాటా ఉంటుంది. ఓఎఫ్ఎస్ రూట్లో వాటాల విక్రయం వల్ల సర్కార్ వాటా 74.67 శాతానికి పడిపోనున్నది.
ఆర్వీఎన్ఎల్ను 2003లో రైల్వే మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. 100 శాతం పెట్టుబడులు రైల్వేశాఖవే. రైల్వే ప్రాజెక్టులను చేపటటడానికి అవసరమైన బడ్జెటేతర నిధులను సేకరించడంతోపాటు ఫాస్ట్ట్రాక్ ప్రాతిపదికన రైల్వే మౌలిక వసతుల అభివ్రుద్ధిని ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యాలు. 2005 మార్చి నుంచి ఈ సంస్థ పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది.
రైల్వేమంత్రిత్వశాఖ పరిధిలో పని చేసే ఈ సంస్థ… వివిధ రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిధులను సేకరించడానికి ఆర్వీఎన్ఎల్కు పూర్తిగా అధికారం కల్పించింది కేంద్రం. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించడం ఈ సంస్థ కర్తవ్యాల్లో ఒకటిగా ఉంది.
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
భారత్లోకి జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు.. ధరెంతంటే!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!