స్థానిక సంస్థలకు నిధుల విడుదలపై ప్రజాప్రతినిధుల హర్షం
ఆయా చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
నార్నూర్, మార్చి 19: శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే, ఎంపీపీతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ జిల్లా, మండల పరిషత్లకు వార్షిక బడ్జెట్లో రూ.500కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తున్నదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు ,టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు
బోథ్, మార్చి 19: మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ఎదుట ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో మండల పరిషత్లకు నిధుల కేటాయించడంతో గ్రామాల అభివృద్ధికి సహాయంగా మారిందని అన్నారు. ఎంపీటీసీల ఫోరం తరఫున సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్యాదవ్, ఎంపీటీసీ జుగదిరావు, రజియాబేగం, జాదవ్ సునీత, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, మార్చి19: అన్ని వర్గాలకు దోహదపడేలా బడ్జెట్ను రూపొందించడంపై మండల కేంద్రంలోని ఏఆర్ఎస్ఎస్ కళాశాల ఎదుట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భరత్, ఎంపీపీ జైవంత్రావు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, వైస్ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, ఉపసర్పంచ్ కోల సత్తన్న, నాయకులు రమేశ్, పోశన్న, రాజేశ్, రాజ్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్లో..
గుడిహత్నూర్, మార్చి 19: స్థానిక సంస్థల బలోపేతానికి జిల్లా, మండల పరిషత్లకు రూ.500 కోట్లు కేటాయించినందుకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాథోడ్ పుండలిక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు శగీర్ఖాన్, కృష్ణవేణి, సర్పంచ్లు తిరుమల్గౌడ్, సంగీత, విజయ్, కుమ్ర శంభు, టీఆర్ఎస్ నాయకులు గంగన్న, పరమేశ్, అలీమ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఎదులాపురం, మార్చి19: రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మాల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూరం భగవాన్, అల్లూరి భూమన్న అన్నారు. వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, సబ్ప్లాన్ నిధులు, దళిత వర్గాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
పేదల సంక్షేమ బడ్జెట్..
ఆదిలాబాద్ రూరల్, మార్చి 19: రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ సోనేరావ్, నాయకులు రాజన్న, నారాయణ, రమేశ్, శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మార్చి 19: స్థానిక సంస్థలకు రూ.500కోట్లు బడ్జెట్లో కేటాయించడంపై జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ సెవ్వ లక్ష్మి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రమేశ్, ఆత్మ డివిజన్ చైర్మన్ రమేశ్, ఎంపీటీసీలు బిక్కి గంగాధర్, జంగు పటేల్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, నాయకులు జగదీశ్, నరేశ్, భీంరావ్ పాల్గొన్నారు.
తాంసి, మార్చి19: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ రాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు అశోక్, రఘు, సర్పంచ్లు కృష్ణ, కేశవ్రెడ్డి, నర్సింగ్, గజానన్, నాయకులు పాల్గొన్నారు.