టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త చిత్రం థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే దానిపై తాజాగా ఓ న్యూస్ లైమ్లైట్లోకి వచ్చింది. ఇస్మార్ట్ శంకర్తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన నభానటేశ్ ను ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కు ఎంపిక చేసినట్టు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
యూత్ ఎలిమెంట్స్ తో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న థ్యాంక్ యూ చిత్రంలో ముగ్గురు భామలు చైతూతో రొమాన్స్ చేయనున్నారట. బీవీఎస్ రవి కథ రాశాడు. అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరా వర్క చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతూ ప్రస్తుతం శేఖర్కమ్ముల డైరెక్షన్లో లవ్స్టోరీ చేస్తుండగా..ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.