నిజామాబాద్ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం ఓ నాగుపాము కలకలం సృష్టించింది. ఠాణా ఆవరణలోకి వచ్చిన పామును సిబ్బంది గమనించి ఎస్సైకి, తిర్మన్పల్లి గ్రామానికి చెందిన స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీకి సమాచారం అందించారు. వెంటనే సొసైటీ సభ్యుడు చంద్రశేఖర్ వచ్చి పామును పట్టుకొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.