న్యూఢిల్లీ: కాంబోడియా ప్రధాని హున్ సేన్ భారత్లో తయారైన కరోనా టీకా కొవిషీల్డ్ టీకా తీసుకున్నారు. కాంబోడియా రాజధాని ఫోమ్ పెన్లోని ఓ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో వైద్యులు ఆయన టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్లో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ అనే టీకాను, పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్ టీకాను వినియోగంలోకి తెచ్చాయి. ఈ టీకాలను భారత్లో వినియోగంచడమే కాకుండా, అవసరమైన వివిధ దేశాలకు వారి ఆర్డర్ల మేరకు ఎగుమతి కూడా చేశారు. అందులో భాగంగానే కాంబోడియా కూడా భారత్ నుంచి టీకాలను కొనుగోలు చేసింది.