హైదరాబాద్ : ఎస్సీ ఉప కులాలకు తప్పక న్యాయం చేస్తాం.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ ఉపకులాల నాయకులతో మంత్రుల నివాసంలో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..
రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఎస్సీ ఉపకులాలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కుల ధృవీకరణ పత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలనే అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.
అలాగే ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తప్పకుండా సాయం చేస్తానని మంత్రి తెలిపారు.