న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేయాలని బార్లు, రెస్టారెంట్లు పెట్టుకున్న అభ్యర్థనకు ఆ రాష్ట్ర కోర్టు నుంచి ఊరట లభించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల తర్వాత బార్లు, రెస్టారెంట్లు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీంతో బార్లు, రెస్టారెంట్ల వ్యాపారం పడిపోయింది. ప్రభుత్వం తమ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సుమారు 90 బార్లు, రెస్టారెంట్లు కేసు దాఖలు చేశాయి. న్యాయమూర్తి తిమోరీ వాకర్ ఆ పిటీషన్పై విచారణ చేపట్టారు. తాత్కాలికంగా బార్లు తెరుచుకునేందుకు ఆయన ఇంజక్షన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ బార్లు, రెస్టారెంట్లకు ఊరట లభించింది. బార్లు, రెస్టారెంట్ల తరపున స్టీవ్ కోహెన్ వాదించారు. కర్ఫ్యూ విధించిన బార్లు మూసినంత మాత్రాన వైరస్ వ్యాప్తి అదుపు కాదు అని సైన్స్ ఆధారాలు లేవని ఆయన కోర్టుకు విన్నవించారు.