లవర్బాయ్ అనే ఇమేజ్ నాకు నచ్చదు. ఆ ముద్ర తొలగిపోవాలనే వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా’ అని అన్నారు నితిన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఆనంద్ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన సంగతులివి…
‘శ్రీనివాసకల్యాణం’ తర్వాత నేను నటించిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఆ సమయంలో నటుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే ఆలోచన మొదలైంది. కమర్షియల్ సినిమాలతో పాటు కథాబలమున్న వైవిధ్యమైన చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కథాగమనం ఆద్యంతం జైలులోనే సాగుతుంది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే రొమాన్స్, కామెడీ ఉండవు. ఇందులో ఆదిత్య అనే ఖైదీగా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర సాగుతుంది. ఉరిశిక్ష పడిన అతడు చెస్లో గ్రాండ్మాస్టర్గా ఎలా అవతరించాడు? క్షమాభిక్షతో శిక్ష నుంచి బయట పడ్డాడా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాల రూపకల్పనలో నేను దర్శకుల్ని ఫాలో అవుతా. ఈ సినిమా విషయంలో చంద్రశేఖర్ ఏలేటి నాకు చక్కటి సలహాలిచ్చారు.
రెండేళ్ల కుముందు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ప్రేమ, వినోదం, యాక్షన్ లాంటి కమర్షియల్ హంగులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసేవాణ్ణి. ఇప్పుడు ఆ ఆలోచన కొంత మారింది. లాక్డౌన్ కారణంగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులొచ్చాయి. కొత్తదనం ఉన్న చిత్రాల్ని ఆదరిస్తున్నారు. నాంది, ఉప్పెన లాంటి సినిమాలు ఆ విషయాల్ని రుజువు చేశాయి. నవ్యతను కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది.
వ్యక్తిగత జీవితంతో వృత్తిని ముడిపెట్టడం నాకు నచ్చదు. సినిమాలకు సంబంధించిన ప్రస్తావన మా మధ్య ఎప్పడూ రాదు. నా సినిమాల విషయంలో షాలిని ఎలాంటి సలహాలు ఇవ్వదు. పెళ్లికి ముందు షాలిని తరచుగా మా ఇంటికి వస్తుండేది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. తను ఎప్పటినుంచో మా కుటుంబంలో భాగం అయిన ఫీలింగ్ నాలో ఉంది. అందువల్లే పెళ్లి జరిగినా మా జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదు.
ప్రస్తుతం ‘రంగ్దే’ షూటింగ్ పూర్తయింది. అలాగే ‘అంధాదూన్’ చిత్రీకరణ జరుగుతోంది. ‘పవర్పేట’ మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.
మిగిల్చింది. కానీ లైఫ్లో మాత్రం కొన్ని మంచి విషయాలు జరిగాయి. 2020లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. అలాగే నేను నటించిన ‘భీష్మ’పెద్ద హిట్టయింది.
ప్రేమకథలు బోర్ కొట్టాయి. నా కెరీర్లో ఎక్కువగా లవ్స్టోరీస్ లోనే నటించా. అందుకే కొన్నాళ్లు ఈ సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. ‘రంగ్దే’ నా కెరీర్లో చివరి లవ్స్టోరీగా భావిస్తున్నా. అలాగే క్రికెట్ నేపథ్యంలో సినిమా చేయాలని కోరిక చాలా కాలంగా ఉండేది. కానీ ఈ క్రీడాంశంతో తెలుగులో గతంలో చాలా సినిమాలొచ్చాయి. అందుకే ఈ ఆలోచనను పక్కనపెట్టా.
పెళ్లి తర్వాత విడుదల అవ్వాలని ప్లాన్ చేసుకొని ఈ సినిమా చేయలేదు. ‘భీష్మ’తో పాటు ఈ సినిమాను అంగీకరించా. కానీ లాక్డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. సినిమా ఆడితే పెళ్లి నాకు కలిసొచ్చిందని అందరూ అంటారు. ఆడకపోతే నా భార్య షాలిని బ్యాడ్లక్ అని చెబుతారు. అందుకు సిని
లవర్బాయ్ అనే ఇమేజ్ నాకు నచ్చదు. ఆ ముద్ర తొలగిపోవాలనే వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా’ అని అన్నారు నితిన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఆనంద్ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన సంగతులివి…
‘శ్రీనివాసకల్యాణం’ తర్వాత నేను నటించిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఆ సమయంలో నటుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే ఆలోచన మొదలైంది. కమర్షియల్ సినిమాలతో పాటు కథాబలమున్న వైవిధ్యమైన చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కథాగమనం ఆద్యంతం జైలులోనే సాగుతుంది. రెగ్యులర్ సినిమాల్లో కనిపించే రొమాన్స్, కామెడీ ఉండవు. ఇందులో ఆదిత్య అనే ఖైదీగా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర సాగుతుంది. ఉరిశిక్ష పడిన అతడు చెస్లో గ్రాండ్మాస్టర్గా ఎలా అవతరించాడు? క్షమాభిక్షతో శిక్ష నుంచి బయట పడ్డాడా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాల రూపకల్పనలో నేను దర్శకుల్ని ఫాలో అవుతా. ఈ సినిమా విషయంలో చంద్రశేఖర్ ఏలేటి నాకు చక్కటి సలహాలిచ్చారు.
రెండేళ్ల కుముందు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ప్రేమ, వినోదం, యాక్షన్ లాంటి కమర్షియల్ హంగులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసేవాణ్ణి. ఇప్పుడు ఆ ఆలోచన కొంత మారింది. లాక్డౌన్ కారణంగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులొచ్చాయి. కొత్తదనం ఉన్న చిత్రాల్ని ఆదరిస్తున్నారు. నాంది, ఉప్పెన లాంటి సినిమాలు ఆ విషయాల్ని రుజువు చేశాయి. నవ్యతను కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది.
వ్యక్తిగత జీవితంతో వృత్తిని ముడిపెట్టడం నాకు నచ్చదు. సినిమాలకు సంబంధించిన ప్రస్తావన మా మధ్య ఎప్పడూ రాదు. నా సినిమాల విషయంలో షాలిని ఎలాంటి సలహాలు ఇవ్వదు. పెళ్లికి ముందు షాలిని తరచుగా మా ఇంటికి వస్తుండేది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. తను ఎప్పటినుంచో మా కుటుంబంలో భాగం అయిన ఫీలింగ్ నాలో ఉంది. అందువల్లే పెళ్లి జరిగినా మా జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదు.
ప్రస్తుతం ‘రంగ్దే’ షూటింగ్ పూర్తయింది. అలాగే ‘అంధాదూన్’ చిత్రీకరణ జరుగుతోంది. ‘పవర్పేట’ మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.
మిగిల్చింది. కానీ లైఫ్లో మాత్రం కొన్ని మంచి విషయాలు జరిగాయి. 2020లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. అలాగే నేను నటించిన ‘భీష్మ’పెద్ద హిట్టయింది.
ప్రేమకథలు బోర్ కొట్టాయి. నా కెరీర్లో ఎక్కువగా లవ్స్టోరీస్ లోనే నటించా. అందుకే కొన్నాళ్లు ఈ సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. ‘రంగ్దే’ నా కెరీర్లో చివరి లవ్స్టోరీగా భావిస్తున్నా. అలాగే క్రికెట్ నేపథ్యంలో సినిమా చేయాలని కోరిక చాలా కాలంగా ఉండేది. కానీ ఈ క్రీడాంశంతో తెలుగులో గతంలో చాలా సినిమాలొచ్చాయి. అందుకే ఈ ఆలోచనను పక్కనపెట్టా.
పెళ్లి తర్వాత విడుదల అవ్వాలని ప్లాన్ చేసుకొని ఈ సినిమా చేయలేదు. ‘భీష్మ’తో పాటు ఈ సినిమాను అంగీకరించా. కానీ లాక్డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. సినిమా ఆడితే పెళ్లి నాకు కలిసొచ్చిందని అందరూ అంటారు. ఆడకపోతే నా భార్య షాలిని బ్యాడ్లక్ అని చెబుతారు. అందుకు సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని షాలిని భయపడుతోంది.మా ఫలితం ఎలా ఉంటుందోనని షాలిని భయపడుతోంది.