జగిత్యాల : కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుడిసె కొమురయ్య, వడ్డెవేణి లావణ్యకు చెందిన గొర్రెలను పిచ్చి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాయి. మిగతా 20 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. గొర్రెల విలువ సుమారు రెండు లక్షల పైగా ఉంటుందని గొర్రెల కాపరి బోరున విలపించాడు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు పరిశీలించారు. బాధితులను ఆదుకోవాలని జిల్లా పశు వైద్య శాఖ అధికారి శ్రీధర్కు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికృష్ణా రావు, ఫ్యాక్స్ చైర్మన్ కానుగంటి శీను, మాజీ సర్పంచ్ లింగారెడ్డి శేఖర్, బంగారు దీపక్, ఒల్లెం కొమురయ్య, సంజీవరెడ్డి, మధు, ఉపేందర్, రంజిత్ రెడ్డి, లక్ష్మణ్ భూమయ్య, అంజి అస్లాం రంజాన్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
దారుణం : భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడి హత్య
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ