బాధితులకు అందుబాటులో ఉండాలి
కలెక్టర్ కే శశాంక
సెంటర్ను సందర్శించి స్టిక్కర్ల ఆవిష్కరణ
విద్యానగర్, మే 19: కరోనా కట్టడిలో టెలీమెడిసిన్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలీ మెడిసిన్ సెంటర్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి హోంఐసోలేషన్లో ఉన్నవారికి టెలీమెడిసిన్ సెంటర్ ద్వారా వైద్యులు ఏ మందులు వా డాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుపాలన్నారు. ఈ సందర్భంగా టెలీమెడిసిన్ కార్యక్రమానికి సంబంధించిన స్టికర్ను ఆవిషరించా రు. ఈ స్టికర్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రా లు, ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, జన సమూహం ఎకువగా ఉన్న ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. టెలీమెడిసిన్ సెంటర్కు రోజుకు ఎన్ని ఫోన్ కాల్స్, ఎకడెకడ నుంచి వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. టెలీమెడిసిన్ సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగించాలని, కొవిడ్ వ్యాధిగ్రస్తులు, వారి సంబంధికులు, అనుమానితులకు సూచనలు, సలహాలు ఇచ్చి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. మిస్డ్కాల్ వస్తే వెంటనే తిరిగి వారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఆదేశించారు. ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయవద్దని సెంటర్ ఇన్చార్జి వైద్యాధికారికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దన్నారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కొవిడ్ ని యం త్రణకు తీసుకుంటున్న చర్యలు, ఇంటింటి ఆరోగ్య పరీక్షల సర్వేపై సమీక్ష నిర్వహించి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, డీటీసీఓ డాక్టర్ రవీందర్రెడ్డి, ఎస్ఎంవో డాక్టర్ నాగశేఖర్, డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేందర్రెడ్డి, డెమో రంగారెడ్డి, ఏవో ఖాదర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
భగీరథుడి జయంత్యుత్సవాలు..
కార్పొరేషన్, మే 19: కరీంనగర్ కలెక్టరేట్లో భ గీరథ మహర్షి జయంత్యుత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ శశాంక పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భగీరథ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.