మంత్రి కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని నియోజకవర్గంలో కార్యక్రమం
కోరుట్ల, మెట్పల్లిలో కేంద్రాలు
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంజయ్
మెట్పల్లి, జూలై 17: ఈనెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొవిడ్ టీకాలను తన సొంత ఖర్చులతో వేయించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా.కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. శనివారం మెట్పల్లిలోని తన నివాసంలో డిగ్రీ కళాశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికీ టీకా వేస్తామని అన్నారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి టీకా వేసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఉచితంగా కొవిడ్ టీకా వేయిస్తున్న సంజయ్ ను కళాశాలల కరస్పాండెంట్లు శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, నాయకుడు చెర్లపల్లి రాజేశ్వర్గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ, ఆల్రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్లలో కళాశాల ప్రతినిధులతో సమావేశం
కోరుట్ల, జూలై 17: పట్టణంలోని పీఆర్బీఎం జూనియర్ కళాశాలలో స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప్రతినిధులతో టీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్కుమార్ సమావేశమయ్యారు. ఈనెల 24న విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ తమ కళాశాలల్లోని విద్యార్థులందరికీ టీకాలు అందించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, ఆయా కళాశాలల ప్రతినిధులు పోతని ప్రవీణ్కుమార్, అంజయ్య గౌడ్, నరేశ్, పోతని నవీన్, నాయకులు భాస్కర్రెడ్డి, జాల వినోద్కుమార్, సనావొద్దీన్తోపాటు తదితరులు పాల్గొన్నారు.