కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జగిత్యాల రూరల్, మే 16: సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొనియాడారు. ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఆదివారం ఆయన 65మంది లబ్ధిదారులకు 19.57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో లేని, కరోనా చికిత్సలకు ప్రజలు చెల్లించిన బిల్లులకు సీఎం కేసీఆర్ మానవతా ధృక్పథంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడి చెస్ట్ స్కానింగ్ను కేవలం రూ.2వేలకే చేసేలా ధర నిర్ణయించారన్నారు. అడిగిన వెంటనే బిల్లులు తగ్గిస్తున్న ప్రైవేట్ కొవిడ్ దవాఖానల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. వందేళ్ల క్రితం వచ్చిన గత్తర (స్పానిష్ ఫ్లూ)తో లక్షలాది మంది చనిపోయారని, ప్రస్తుతం కరోనా కూడా అలాగే ప్రజల ప్రాణాలను హరించేస్తున్నదన్నారు. కొవిడ్ మొదటి దశలో జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో కేవలం 30 బెడ్స్ను మాత్రమే కేటాయిస్తే, ప్రస్తుతం జిల్లాలో మొత్తం 24 దవాఖానల్లో కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో సుమారు 200మంది వరకు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కొవిడ్ కారణంగా కోల్పోవాల్సి రావడం బాధాకరమన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కూతురు రాజేశ్, బండారి రజని రాజేందర్, పిట్ట ధర్మరాజు, కూతు రు పద్మ, సిరికొండ భారతి రాజయ్య, కోరె గంగమల్లు, పంబాల రాము, చుక్క నవీన్, క్యాదాసు నవీన్, బొడ్ల జగదీశ్, జుంబర్తి రాజ్ కుమార్, వారణాసి మల్లవ్వ తిరుమలయ్య, దాసరి లావణ్య ప్రవీణ్, అల్లె గంగాసాగర్, వొల్లెపు రేణుక మొగిలి, పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద రావు, నాయకులు బోగ ప్రవీణ్, జెడి, కూతురు శేఖర్, రాచకొండ విజయ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం
కొవిడ్ బారినపడిన వారు అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి, నల్లగొండ, చెప్యాల, రామకిష్టాపూర్, కొండాపూర్ల్లో కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆదివారం ఆయన అడిగి తెలుసుకున్నారు. కరోనాతో ఇటీవల చనిపోయిన వారి కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి, మాట్లాడారు. కొవిడ్ వచ్చినా మనోధైర్యం కోల్పోవద్దని, బాధితులకు అండగా ఉంటామన్నారు. చుట్టుపక్కల వారు మనోధైర్యం కల్పించాలన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
సీఎం సహాయనిధి ద్వారా ఆరుగురు లబ్ధిదారులకు రూ.1,98,600 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇక్కడ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, పీఏసీఎస్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, నరేందర్రెడ్డి ఉన్నారు.