మ్యాదరికండి చెరువు నిర్మాణానికి 4.30 కోట్ల నిధుల మంజూరు
ప్రత్యేక కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, జూన్ 14 : ఎండపల్లితో సహా 4 గ్రా మాల రైతుల 45 ఏండ్ల సమస్యకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో పరిష్కారం కానుంది. రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి మ్యాదరికండి చెరువు నిర్మాణానికి రూ.4.30 కోట్ల నిధులు మం జూరు చేయించి సంబంధిత జీవోను విడుదల చేయించారు. ధర్మారం, వెల్గటూర్ మండలాల స రిహద్దు కొత్తపల్లి, ఎండపల్లి గ్రామాల సరిహద్దు శి వారులో గుడ్డేనుగుల బోరు, ఎలుకల గట్టును ఆ నుకొని బండజూగి వరకు సుమారు 25 ఎకరాల స్థలంలో ఈ చెరువు నిర్మాణం చేయనున్నారు.
45 ఏండ్ల కల
45 ఏండ్ల క్రితం ఎస్సారెస్సీ కాలువ నిర్మాణం చేసే క్రమంలో మ్యాదరికండి చెరువు నిర్మాణం చేయాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ నాటి పాలకులు అలసత్వంతో ప్రతిపాదన మరుగునపడింది. చెరువు నిర్మాణం చేపట్టకపోవడంతో నాలుగు గ్రామాల రైతుల వ్యవసాయానికి ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండపల్లికి వచ్చిన క్రమంలో మ్యాదరికండి చెరువును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చెరువు నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించారు. దీంతో ఎండపల్లితో పాటు 4 గ్రామాల వారి సాగునీటి చిరకాల కోరికను తీర్చి సుమారు 4 వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ కానుంది. రైతులు మంత్రి కొప్పుల, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.