జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్
ప్రపంచ జనాభా దినోత్సవం
జగిత్యాల, జూలై 13: కుటుంబ నియంత్రణ పాటించాలని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ, కుటుంబ నియంత్రణ కోసం ప్రభు త్వం అనేక పద్ధతులను ప్రవేశపెట్టిందని, వివా హం తర్వాత తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి కనీసం రెండు సంవత్సరాల తర్వాత మొదటి బిడ్డ, రెండో సంతానం కోసం కనీసం మూడేళ్ల వ్యవధి ఉండాలని సూచించారు. అందువల్ల భార్యతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మహిళలకు చేసే ట్యూబెక్టమి ఆపరేషన్ కంటే మగవారికి చేసే వెసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైందన్నారు. పురుషులు ఎలాం టి అపోహలకు గురికాకుండా ఎన్ఎస్వీ ఆపరేషన్కు ముందుకు రావాలని సూచించారు. ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా లో ఆరో గ్య సిబ్బంది తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు నోటి మాత్రలు, అంతర ఇంజక్షన్ల గురించి వివరిస్తారన్నారు. శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ఉత్తమ సేవలకు పురస్కారం
ఉత్తమ కుటుంబ నియంత్రణ సర్జన్లుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, మెట్పెల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం సర్జన్ డాక్టర్ చైతన్య సుధ, ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న సృజన ఉత్తమ స్టాఫ్ నర్సుగా, ఉత్తమ ఆరోగ్య పర్యవేక్షకురాలిగా పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అరుణ, ఉత్తమ ఆరోగ్య కార్యకర్తగా జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని విజయలక్ష్మి, ఉత్తమ ఆశ కార్యకర్తగా రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చెందిన రాజేశ్వరి జ్ఞాపికలను అందుకున్నారు. అలాగే డివిజన్ల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉత్తమ సేవలందించిన వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన అంతర ఇంజక్షన్ వాడుతున్న జంటకు రూ.1000 నగదు ప్రోత్సా హం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎండీ సమియొద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి, యూజీసీ లాలో, ఉత్తమ సేవలందించిన వైద్యాధికారులు, సిబ్బంది, డెమో తులసి రమణ, హెచ్ఈ భూమేశ్వర్, డీపీవో స్వామి, డిప్యూటీ ఎస్వో పద్మయ్య, జిల్లా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.