కొత్తపల్లి, జనవరి 12: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని కోరారు. 15-18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. సర్వసభ్య సమావేశానికి ముందు వివేకానందుడి చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో జడ్పీటీసీ పిట్టల కరుణ, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ నాయక్, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్, పండుగ గంగవ్వ-నర్సయ్య, మంద రమేశ్, కమల-మనోహర్, సర్పంచులు జింక సంపత్, నాయిని ప్రసాద్, మొగిళి మంజుల-సమ్మయ్య, కడారి శాంత-శ్రీనివాస్, ఎంపీవో దొంత శ్రీనివాస్, ఏవో రంజిత్, ఎంఈవో మధుసూదనచారి, సీడీపీవో ఉమారాణి, మండల అధికారులు పాల్గొన్నారు.