జగిత్యాల టౌన్, జులై 11: జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ పాటించాలని, లింగ వివక్షత వీడనాడాలని, మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. అధిక జనాభా విషయంలో ప్రజలను చైతన్య పర్చడంలో ప్రభుత్వాలు, విద్యావంతులు, మీడియా, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణారెడ్డి, గౌరిశెట్టి విశ్వనాథం, వెలుముల ప్రకాశ్రావు, పబ్బా శివానందం, దొంతుల లక్ష్మీకాంతం, చీటి విద్యాసాగర్రావు, అలిశెట్టి ఈశ్వరయ్య, మానాల కిషన్, గొర్రె విద్యాసాగర్, పురుషోత్తంరావు, నలువాల హన్మాండ్లు, హన్మంతరెడ్డి, సత్యనారాయణతోపాటు తదితరులు పాల్గొన్నారు.
మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
మల్యాల, జూలై 11: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుం బ నియంత్రణ పాటించాలని వైద్యాధికారి నరేశ్కుమార్ సూచించారు. ఇక్కడ ఆశ కార్యకర్తలు, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెట్పల్లి పట్టణంలో
మెట్పల్లి, జూలై 11: పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలు, కుటుంబ నియంత్రణతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి మర్రి భాస్కర్, సభ్యులు తుకారాం, రాజ్కుమార్, విజయ్, రాకేశ్, ఆంజనేయులు, మృత్యుంజయం, ముత్యాల ఆనంద్రెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు.