విద్యానగర్, మే 10 : జిల్లాలో గల ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీల ద్వారా దవాఖానలకు వేగం గా ఆక్సిజన్ సరఫరా చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ కే శశాంక నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం మానకొండూరు మండలం ఖాదర్గూడెంలో బృందావనం ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీ, ఉజ్వలపార్ వద్ద గల సిద్ధివినాయక ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తున్నందునా ఎకువమంది రోగులకు వైద్యశాలల్లో ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. కొరత రాకుండా తగిన చర్య లు తీసుకోవాలని అన్నారు. ఆక్సిజన్ ఫీల్లింగ్ ప్లాం ట్లలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఏమైనా మిషన్స్ చెడిపోతే వెంటనే రిపేర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు వచ్చే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రవాణాలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. జిల్లాకు వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ను వెంటనే రీఫిల్లింగ్ చేసి అవసరమైన దవాఖానలకు త్వరగా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మానకొండూర్ తహసీల్దార్ రాజయ్య ఉన్నారు.