జగిత్యాల అర్బన్, జూలై 1: జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ దశరథ నాయుడు భార్య మహాలక్ష్మి నాయుడు, కుమారుడు డాక్టర్ చంద్రకాంత్, కుమార్తె డాక్టర్ లావణ్య సూచనల మేరకు జిడిగె పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా రెండున్నర దశాబ్దాలు జగిత్యాలలో వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ దశరథ నాయుడుకు సహకారం అందించిన డాక్టర్ చిదానందం, డాక్టర్ రామయ్యను సన్మానించారు. దివంగత డాక్టర్ దశరథ నాయుడు కుమారుడు డాక్టర్ చంద్రకాంత్ అమెరికాలో ఉన్నప్పటికీ కొవిడ్ సమయంలో ప్రభుత్వ దవాఖానల్లో సేవలు అందించిన వైద్యులకు గౌరవం అందించడం కోసం సన్మాన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు, డాక్టర్లు పురుషోత్తం, సతీశ్కుమార్, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, జిడిగె కిషన్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ దశరథ నాయుడు నేటి తరానికి మార్గదర్శకుడు అని అన్నారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె జగిత్యాల ప్రాంతాన్ని విస్మరించకుండా వైద్యులను గౌరవించడంపై ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్వో శ్రీధర్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సుదక్షిణాదేవి, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణతో పాటు పలువురు వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ డాక్టర్ శ్రావ ణి, ఐఎంఎ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.