4లోగా ఇంటింటా జ్వర సర్వే పూర్తి చేయాలి
వైద్యాధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశం
విద్యానగర్, మే 31 : జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని కలెక్టర్ శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ఇంటింటా జ్వర సర్వేను ఈ నెల 4లోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ పరీక్షలు, ఇంటింటా సర్వే, వ్యాక్సినేషన్పై ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్, సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొవిడ్ పాజిటివ్ కేసులు ఎకువ ఉన్న గ్రామాల్లో మొబైల్ టీంల ద్వారా పరీక్షలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్ట్ కొవిడ్ సేవలను ప్రారంభించాలన్నారు. రెండో విడుత ఇంటింటా సర్వేలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తదుపరి వైద్య సేవలందించాలన్నారు. జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే కొనసాగుతున్నదని, అలాగే ప్రభుత్వం సూచించిన ప్రకారం హైరిస్గా గుర్తించిన వారికి మాత్రమే మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. కొవిడ్ టీకా రెండో డోస్ డ్యూ ఉన్న వారికి ఫోన్ చేసి వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, మందులు, ఇంజెక్షన్లు సరిపడా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజీదా, నోడల్ ఆఫీసర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, డీటీసీవో డాక్టర్ రవీందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లతోపాటు వైద్యులు సుధాకర్రెడ్డి, నాగశేఖర్, స్వాతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
కరీంనగర్, మే 31 (నమస్తే తెలంగాణ): జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కే శశాంక తెలిపారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొవిడ్-19 ప్రభావం వల్ల రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా కాకుండా నిరాడంబరంగా అతికొద్ది మంది ముఖ్యుల సమక్షంలో జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉదయం 9 గంటలకు జెండా ఆవిషరిస్తారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా అధికారులు, ఆర్డీవో ఆనంద్కుమార్, సీఐ మురళి, అర్బన్ తహసీల్దార్ వెంకట్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.