జగిత్యాల విద్యానగర్/ ఓదెల సెప్టెంబర్ 17: మద్యం దుకాణాల్లో 15 శాతం కోటా కేటాయించడంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాల జిల్లాకేంద్రం, పెద్దపల్లి జిల్లా ఓదెలలో సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. జగిత్యాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్ హాజరై మాట్లాడారు. సర్కారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో గీత కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. సర్వాయి పాపన్న ఆశయాలను కేసీఆర్ నెరవేరుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి శ్రీధర్ గౌడ్, వెల్దుర్తి సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, అంబారిపేట సర్పంచ్ గంగాధర్ గౌడ్, కల్లెడ ఎంపీటీసీ పరశురాం గౌడ్, గౌడ సంఘం రాయికల్ మండలాధ్యక్షుడు ఉత్తం సాయిగౌడ్, గొల్లపల్లి నాగరాజు గౌడ్, బుర్ర శ్రీధర్ గౌడ్, కొత్తకొండ అంజయ్య గౌడ్, తిరుపతి గౌడ్, గౌడ సంఘం బుగ్గారం మండలాధ్యక్షుడు మూల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు కొత్తకొండ లింగం గౌడ్ ఉన్నారు. ఓదెలలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్గౌడ్, ఉప సర్పంచ్ గట్టు మహేశ్గౌడ్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బొమ్మక నరేశ్, పల్లెర్ల రమేశ్, గౌడ సంఘ నాయకులు ఎల్లయ్యగౌడ్, రమేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు ఆరాధ్యుడు కేసీఆర్
వైన్షాపుల కేటాయింపులో గిరిజనులకు 5 శాతం కోటా కల్పించిన సీఎం కేసీఆర్ గిరిపుత్రులకు ఆరాధ్యుడిగా నిలిచిపోతారని బంజారా సంఘం జిల్లా నాయకుడు అజ్మీరా రాజునాయక్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో గిరిజనులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ సర్పంచులు భూక్యా శంకర్నాయక్, గుగులోత్ పెంటయ్య నాయక్, భూక్యా ప్రభునాయక్, నాయకులు అజ్మీరా తిరుపతినాయక్, సీత్యా నాయక్, కళ్యాణ్నాయక్, ప్రకాశ్నాయక్, యశ్వంత్నాయక్, తదితరులు పాల్గొన్నారు.